Kishan Reddy: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం!

తెలంగాణలో కరవుకు కాంగ్రెసే కారణమన్నారు కిషన్‌రెడ్డి. కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైందని.. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. కరవు నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతారో కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

New Update
Kishan Reddy: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం!

Kishan Reddy: బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు అభ్యర్థులు దొరకడం లేదని వ్యాఖ్యానించారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. మోదీకి (PM Modi) వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్‌రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ కొనాలని మోదీని కోరితే ఓకే చెప్పారు. ఈనెల ఒకటి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలను కేంద్రము ప్రారంభిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు.

బోనస్ ఇవ్వాలని డిమాండ్‌:

రైతులను (Farmers) గత ప్రభుత్వం మోసం చేసింది.. అదే బాటలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నడుస్తుందని కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ధాన్యంకి బోనస్ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన్‌ ప్రశ్నించారు. 70 లక్షల టన్నుల ధాన్యం కొంటామని కేంద్రానికి ఈ ప్రభుత్వం చెప్పింది.. ప్రతి క్వింటాల్‌కి 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేలు రైతు భరోసా ఇవ్వాటంతోపాటు కౌలు రైతులను ఆదుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. కరువుతో పంటలు ఎండిపోతున్నాయి వెంటనే సర్కార్ స్పందించాలన్నారు.

ఎలాంటి కరువు సహాయక చర్యలు తీసుకుంటారు..?

రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ధ్వజమెత్తారు.సాగు తాగు నీటి ఎద్దడి మొదలైంది. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు నుంచి ప్రజలను ఏ విధంగా గట్టు ఎక్కిస్తారో, ఎలాంటి కరువు సహాయక చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలని కిషన్‌రెడ్డి కోరారు. బీజేపీ రైతులకు అండగా ఉంటుంది. రైతులు సంక్షేమంగా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లు బీజేపీ గెలుస్తుందని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: మండలి వర్సెస్‌ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment