DK Shiva Kumar : కాంగ్రెస్‌ నేత చెంప పగలకొట్టిన డీకే!

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్‌ నేత చెంప చెళ్లుమనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్‌ మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ పై విమర్శలు చేశారు.

New Update
DK Shiva Kumar : కాంగ్రెస్‌ నేత చెంప పగలకొట్టిన డీకే!

Karnataka : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shiva Kumar) ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్‌(Congress) నేత చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ(BJP) ఐటీ సెల్ అధినేత అమిత్‌ మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ పై విమర్శలు చేశారు.

శనివారం ధార్వాడ్‌ లోక్‌ సభ ఎన్నికల(Lok Sabha Elections) అభ్యర్థి వినోదా అసూటీ తరుఫున హవేరీలో ఎన్నికల పరచారం నిర్వహించేందుకు డీకే వచ్చారు.
ఈ క్రమంలో ఆయన కారు దిగి వస్తుండగా.. వీపుపై కాంగ్రెస్ మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ చెయ్యి వేశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన డీకే..ఆయన చెంప మీద లాగిపెట్టి కొట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అల్లావుద్దీన్‌ను వెనక్కు తోసేశారు.

ఈ ఘటన తాలూకు వీడియోపై అమిత్ మాలవీయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ మున్సిపల్ మెంబర్‌ చెంప చెళ్లుమనిపించారు. హవేరీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలపై డీకే చేయి చేసుకోవడం ఇది కొత్త కాదు. మనియార్ తప్పేంటి అంటే ఆయన డీకే భుజంపై చేయి వేయడమే.

అసలు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ఎందుకు పనిచేస్తారో నాకు అర్థంకాదు. వాళ్ల నాయకులు కార్యకర్తలపై చేయిచేసుకుంటుంటారు. నలుగురిలో అవమానిస్తుంటారు. ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇవ్వరు. అవినీతి డబ్బు కోసమే కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటారా? ఆత్మాభిమానం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు.

Also read: ఎన్నికల ప్రచారం లో సాయిధరమ్ తేజ్ కు తప్పిన ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment