రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్లు రాకపోవడంతో బీఆర్ఎస్‌ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి టికెట్లు దక్కకపోవడం బాధాకరమన్నారు.

New Update
రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రవేశ పెట్టడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేత నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 15 సంవత్సరాలుగా తాను పార్టీ కోసం కష్టపడి పని చేశానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంతా తాను ముందుకు నడిపించానని గుర్తు చేశారు. 70 సంవత్సరాల వ్యక్తికి మూడు సార్లు అవకాశం ఇచ్చినా తాను ఓపికగా ఉన్నానని, పార్టీ గెలుపుకోసం పని చేశానని తెలిపారు. పార్టీ కొసం కష్టపడి పని చేసిన వారిని కేసీఆర్‌ పట్టించకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్‌ సందించారు. తాను ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడ్డ వారిని టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమని రేఖ శ్యాం నాయక్ అన్నారు. రానున్న 90 రోజులు తాను ఎమ్మెల్యేనన్న ఆమె.. ఈ 90 రోజులు ప్రజల మధ్య తిరుగుతానని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనపై మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డానన్న ఆయన.. ఒక్కసారి ఓడిపోయిన మాత్రాన తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు వీరేశం క్యాంపు కార్యాలయానికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. అనుచరులతో వీరేశం సమావేశమయ్యారు. తన భవిష్యత్‌ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని వేముల వీరేశం స్పష్టం చేశారు. కాగా ఈ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  

రాజాసింగ్ కామెంట్స్

గోషామహల్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. కేసీఆర్‌ ఎంఐఎంకు భయపడుతున్నారని ఆరోపించారు. గోషామహల్‌ అభ్యర్థిపై ఎంఐఎం నేతలుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఎద్దేవా చేశారు. ఎఐఎం పార్టీ నేతలు ఎవరికి టికెట్‌ ఇవ్వాలంటే కేసీఆర్ వాళ్లకే ఇస్తారని విమర్శించారు. గతంలో గోషామహల్‌లో పోటీ చేసిన ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ కూడా ఎంఐఎం పార్టీ రిఫెర్‌ చేసిన అభ్యర్థేనని రాజాసింగ్‌ గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ పెద్దల అశిర్వాదం తనకేం ఉందన్న ఆయన రానున్న ఎన్నికల్లో సైతం విజయం సాధించేది తానని జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆయన వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్‌ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

కసిరెడ్డిదే కీలక పాత్ర..

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. 

అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)

Advertisment
Advertisment
Advertisment