Harish Shankar : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్

హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ బదులిస్తూ..' పవన్‌కల్యాణ్‌, రవితేజతో మల్టీస్టారర్ చేస్తానని అన్నారు.

New Update
Harish Shankar : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్

Director Harish Shankar : హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మల్టీస్టారర్ సినిమా తీయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అది కూడా ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ తో కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) మూవీ ప్రమోషన్స్ లో బాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అని అడగ్గా.. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), రవితేజతో (Ravi Teja) చేస్తానని అన్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్‌ ప్రేక్షకులు విజిల్స్‌ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగానూ ట్రెండ్‌ అవుతుండటంతో ఓ ట్వీట్‌కు కూడా హరీశ్‌ రిప్లై ఇచ్చారు. ‘చాలా మంది చాలాసార్లు అడిగారు. అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం’ అన్నారు. హరీష్ మాటలను బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఖచ్చింతంగా ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లడం గ్యారెంటీగా కనిపిస్తుంది.

Also Read : ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు’… మంగ్లీ వాయిస్ అదిరింది..!

ఓ మాములు కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి తనదైన మేకింగ్ తో సినిమాలు తీసి ఆడియన్స్ ను అలరించాడు హరీష్ శంకర్. ఆయన సినిమాలలో యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తారు. ఇలాంటి దర్శకుడు మల్టీస్టారర్ చేస్తే అది ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికొస్తే .. హిందీ 'రైడ్' మూవీకి రీమేక్ గాతెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు