Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు!

నేపాల్‌ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్‌ కు తీసుకురావడానికి ఎయిర్‌ ఫోర్స్‌ విమానం నేపాల్‌ కు బయల్దేరింది.

New Update
Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు!

Nepal Bus Accident: నేపాల్‌ లో శుక్రవారం బస్సు నదిలోకి దూసుకెళ్లి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరుకుంది. యూపీలోని గోరఖ్‌పూర్‌ కు చెందిన పర్యాటక బస్సులో డ్రైవర్‌, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్ లోని పొఖారా నుంచి ఖాట్మాండుకు బయల్దేరారు.

తనహు జిల్లాలోని అంబూ ఖైరేని ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు.

మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్‌ కు తీసుకురావానికి ఎయిర్‌ ఫోర్స్‌ విమానం నేపాల్‌ కు బయల్దేరింది.

Also Read: గుడ్‌ బై..గబ్బర్‌ షాకింగ్‌ నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు