గంగవరం పోర్టును జగన్ అమ్మేశారు: పవన్

గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

New Update
నష్టపోయిన మత్స్యకారులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

గంగవరం పోర్టును జగన్అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించింది. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గాజువాకలో ఓడిపోయినా.. తనకు ఘన స్వాగతం పలికారని ఎమోషనల్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారు.. గుడిలో ప్రసాదం తింటున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జగన్ మాట్లాడారని.. కేంద్రాన్ని నిలదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఆయన.. తనను ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రైవేటీకరణ వద్దని.. సొంత గనులు కేటాయించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరానని తెలిపారు. తనను మాట్లాడమని అంటున్నారని.. తమకు ఎంపీగా గెలిపించలేదన్నారు. మరి గెలిచిన వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసులు ఉన్న వాడికి, లూటీ చేసే వాడికి ధైర్యం రాదని.. అందుకే కేంద్రాన్ని ఏం అడగలేక పోతున్నారని విమర్శించారు. ఆంధ్రా ఎంపీలు అంటే..కేంద్రానికి చులకన అని.. అందుకే కేంద్రం ఖాతరు చేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులకు ఆశపడకండి.. నిజాయితీ పరులను ఎన్నుకోండని ప్రజలకు పిలుపునిచ్చారు.

తనను వ్యతిరేకించేవారే అయితే ప్రజలు ఇంత భారీ సంఖ్యలో వచ్చేవారు కాదన్నారు. గాజువాక నియోజకవర్గంలో జగన్ లాంటి రాక్షస పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేగా ఉండటం దారుణమన్నారు. తాను ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. తాను అన్యాయాన్ని అరికట్టాలంటే రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎప్పటికీ తన ఆశయం, జనసేన ఆశయం ఓడిపోదన్న పవన్‌.. ఉత్తరాంధ్ర నుంచే ప్రజల కోసం పోరాటం చేయడం నేర్చుకున్నానని. 2024 ఎన్నికల అనంతరం గాజువాకలో జనసేన జండా ఎగురడం ఖాయమని పవన్‌ని ప్రదర్శించారు. ఏపీకి విశాఖ స్టీల్ ప్లాంట్‌మన్న జనసేన అధినేత.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

విశాఖపట్నం పీఎం పాలెం ప్రాంతంలో జ్ఞానేశ్వర్‌, అనూష మధ్య మనస్పర్థలు చెలరేగాయి. అనూష 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా, భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జ్ఞానేశ్వర్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

New Update
vishaka crime

vishaka crime

విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం ప్రాంతంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గర్భవతి భార్యను భర్తే గొంతునులిమి హత్య చేసిన సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న జ్ఞానేశ్వర్, అనూష దంపతుల మధ్య ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్న అనూషకు మరికొద్ది గంటల్లో డెలివరీ జరగాల్సి ఉండగా, ఆమె భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.

Also Read :  మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?

భార్యను బలి తీసుకున్న భర్త..

ఈ ఉదయం అనూష తీవ్ర అస్వస్థతకు గురైందని చెప్పి జ్ఞానేశ్వర్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం అనూష మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పీఎం పాలెం పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా జ్ఞానేశ్వర్ అనూషను తానే హత్య చేశానని అంగీకరించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అనూషపై జ్ఞానేశ్వర్‌కు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఎండలో తిరిగి చర్మం నల్లగా మారిందా.. ఇలా చేస్తే మళ్లీ మెరుస్తుంది

అయితే ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అనూష కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భవతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన జ్ఞానేశ్వర్‌కు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Also Read :  అందుకే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా: మొదటి పెళ్లిపై అఘోరీ సంచలన వీడియో!



(ap crime latest updates | ap-crime-news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-crime-reports | telugu crime news | breaking news in telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు