Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు! చలికాలంలో పిల్లల బెడ్ పైనా టాయిలెట్ పోస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే ఒక గంట ముందు ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను 1-15ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది By Vijaya Nimma 16 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Children Milk: చిన్న పిల్లలు రాత్రి నిద్రలో మూత్ర విసర్జన చేస్తారు. ఈ సమస్య శీతాకాలంలో మరి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో పిల్లలలో బెడ్ చెమ్మగిల్లడం సమస్యలను ఇంటి నివారణ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు తరచుగా నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటే ప్రతి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతారు. ఇలాంటి సమస్యను వైద్య భాషలో నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అంటారు. రాత్రిపూట ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు..పిల్లలు తెలియకుండానే మూత్ర విసర్జన చేస్తారు. మంచం చెమ్మగిల్లడం 5 నుంచి అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే చేస్తారని అనుకోవద్దు. కొందరు పెద్ద పిల్లలు కూడా ఈ సమస్య ఉంటుంది. తడి మంచం మీద ఎక్కువసేపు పడుకుంటే చలిగా ఉంటుంది, తడి మంచం చెడు వాసన, అనేక ఇతర వ్యాధులకు కూడా కారణం అవుతుంది. పిల్లలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. బయటపడటానికి ఇంట్లో పరిష్కరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇంటి నివారణల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరిష్కారం: చలికాలంలో పిల్లలు చాలా మంచం తడిపేస్తుంటే దీనికి ప్రధాన కారణం పిల్లల బలహీనమైన రోగనిరోధక శక్తి, జలుబు. దీంతోపాటు..ఎక్కువ నీరు త్రాగడం, ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువ స్వీట్లు తినడం, ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల ఇలా చేస్తారు. చలికాలంలో ఈ పాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. 1 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ప్రతిరోజూ పాలు తాపించాలని వైద్యులు అంటున్నారు.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వెచ్చగా ఉంచి, పిల్లలను జలుబు, దగ్గు నుంచి కాపాడుతుంది.ఇలా ప్రతిరోజూ చేస్తే మంచం తడిపే సమస్య తగ్గుతుంది. తయారు విధానం: ఖర్జూరం, ఎండుద్రాక్ష కలపిన పాలు పిల్లలకు ఎంతో మేల చేస్తాయి. ఈ పాలను తయారు చేయడానికి..ఒక గ్లాసు పాలలో నానబెట్టిన రెండు ఖర్జూరాలను కలుపుకోవాలి. రెండు నుంచి నాలుగు ఎండుద్రాక్షాలను పాలలో వేసి..వాటిని కలిపి మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ పాలను కొద్దిగా వేడి చేసి రాత్రి పడుకునే ఒక గంట ముందు పిల్లలకు ఇవ్వాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే పిల్లల్లో తేడా కనిపిస్తుంది. ఈ పాలను 1 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు పాలు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం, ఎండుద్రాక్ష పాలు రోజూ తీసుకోవడం వల్ల పిల్లల బరువు పెరుగుతారు. శరీరంలోని రక్తహీనత కూడా తొలగిపోతుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే మెదడుకు మంచిదా..? వారు ఏ వయస్సులో బూట్లు ధరించాలి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #dates #habit #children-milk #toileting #raisins సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి