విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం!

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

New Update
dfedre

Accident: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం ఐతవరం దగ్గర టిప్పర్ లారీ కారును బలంగా ఢీ కొట్టింది. కారులో ఉన్న వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు కంచికచర్ల మండలం చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్‌ గా పోలీసులు గుర్తించారు. 

టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఘోరం..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇక హైవేపై కిలోమీటర్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడగా.. కీసర టోల్‌ ప్లాజాకు కిలోమీటరు దూరంలోనే ప్రమాదం జరిగినా హైవే ఎమర్జెన్సీ సిబ్బంది స్పందించకపోవడంపై స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌కు స్పాట్ కు 10 నిమిషాల్లో చేరుకోవాల్సింది 30 నిమిషాల తర్వాత వచ్చారని వాహనదారులు మండిపడ్డారు. వారు సరైన సమయంలో రాకపోవడంతోనే కోగంటి చనిపోయినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు. హైవే ఎమర్జెన్సీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లాలోనూ..

ఇదిలాఉంటే.. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు అర్థరాత్రి 2 గంటల సమీపంలో ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలో సమీపంలో జాతీయ రహదారిపై ట్యాంకరు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

New Update
marriage 2nd

marriage 2nd

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. 

ఈ సంఘటన ఏప్రిల్ 5వ తేదీన జరిగింది. సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహారియా గ్రామానికి చెందిన గీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలను, భర్తను వదిలి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదృశ్యమైంది. తన భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త  శ్రీ చంద్ అనుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో అతని భార్య పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు. 

పెద్ద కూతురికి 19 సంవత్సరాలు

శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా 5 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలు, చిన్న కూతురికి 5 సంవత్సరాలు. శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడు. గత కొన్ని రోజులుగా, అతను గ్రామంలో కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని  శ్రీ చంద్ చెప్పాడు.

మరోవైపు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని తెలిపింది.  తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.  ఇప్పటి వరకు తాను అన్నీ భరించాను కానీ ఇప్పుడు తన భర్త  రెండో  వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆస్తిలో తన పిల్లలకు వాటా ఇవ్వాలని కోరుతానంది.  ఈ విషయం గురించి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, కానీ ఎవరూ తన మాట వినలేదని గోపాల్ భార్య చెబుతోంది. 

Also read :  Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

 

 

 

Advertisment
Advertisment
Advertisment