స్టూడెంట్‌తో మహిళా టీచర్ శృంగారం.. 30 ఏళ్లు జైలు శిక్ష

యుఎస్‌కి చెందిన మెలిస్సా కర్టిస్ అనే మహిళా టీచర్ 14 ఏళ్ల విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి బలవంతంగా 20 సార్లు శృంగారంలో పాల్గొంది. ఈ కేసులో కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె టీచర్ వృత్తికి కూడా వీడ్కోలు పలకాలని తీర్పునిచ్చింది.

New Update
u1

టీనేజ్ విద్యార్థితో శృంగారం చేసినందుకు ఓ మహిళా టీచర్‌కు జైలు శిక్ష పడిన ఘటన యూఎస్‌లో చోటుచేసుకుంది. యూఎస్‌లోని మేరీల్యాండ్‌కు చెందిన మెలిస్సా కర్టిస్ టీనేజ్ విద్యార్థితో పలుసార్లు శృంగారంలో పాల్గొంది. 2015లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంది.

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

20 కంటే ఎక్కువసార్లు..

కేవలం తను ఒక్క సంవత్సరం మాత్రమే టీచర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే తన కంటే చిన్న వయస్సులో ఉన్నవారికి మభ్య పెట్టి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంది. ఒక 14 ఏళ్లు కుర్రాడితో 20 కంటే ఎక్కువసార్లు శృంగారంలో పొల్గొందని గతేడాది ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

అయితే ఈ ఘటనలో కోర్టు ఆమెకు కేవలం 12 నెలల జైలు శిక్ష మాత్రమే గతేడాది అమలు చేశారు. కానీ ఆమె ఇలా ఎంతో మంది మైనర్లతో క్లాస్‌రూమ్‌లోనే శృంగారం చేసిందని విచారణలో తేలడంతో ఆమెకు కోర్టు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె టీచర్‌గా కూడా పాఠాలు చెప్పకూడదని తెలిపింది. 

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌ నారాయణగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌తోపాటు వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతరి మాతాజీ దర్శానికి వెళ్తున్నారు.

New Update
Madhya Pradesh 123

మధ్యప్రదేశ్‌ నారాయణగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌తోపాటు మరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఉజ్జయిని జిల్లా ఉన్హేల్‌కు చెందిన అంతరి మాతాజీ దర్శానికి వ్యాన్‌లో బయలుదేరారు. మధ్యాహ్నం వాహనం బుధ తక్రావత్ ఫాంటా వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రక్షణ గోడలేని బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను రక్షించేందుకు బావిలోకి దిగిన మరో యువకుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బైకర్‌ సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Also read: KCR: పోలీసులకు KCR మాస్ వార్నింగ్.. ఈరోజు డైరీలో రాసిపెట్టుకోవాలి

నీముచ్‌ జిల్లా మానస ప్రాంతంలోని అంతరి మాత ఆలయాన్ని దర్శించేందుకు ఉజ్జయిని జిల్లాలోని ఉన్హెల్‌ నుంచి పది మంది వ్యాన్‌లో బయలుదేరినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల బాలికతో సహా నలుగురుని కాపాడి మాండ్‌సౌర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ అదితి గార్గ్‌, ఎస్పీ అభిషేక్‌ ఆనంద్‌, ఇతర పోలీసుల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే అదుపు తప్పి రోడ్డున పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో వ్యాన్‌లో ఇద్దరు పిల్లలు సహా 13 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు.

(road-accident | Madhya Pradesh | bike | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment