ఎంత పనిచేశావమ్మా.. ఇల్లాలు పెట్టిన దీపం.. రెండు ఇళ్లు దగ్థం!

పూజగదిలో ఓ ఇల్లాలు వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన  మెదక్ జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
medak home

medak home

పూజగదిలో ఓ ఇల్లాలు వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన  మెదక్ జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.  రెవెన్యూ, పోలీస్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్కు చెందిన మంగలి విఠల్, అంజయ్య ఇద్దరు అన్నదమ్ములు. పక్కపక్కనే ఇళ్లు ఉంటాయి.  ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం విఠల్ భార్య రత్నమ్మ ఇంట్లోని పూజగదిలో దీపం వెలిగించి బయటకు వెళ్లిపోయింది. 

ఈ క్రమంలో  ఆ దీపం ఇంట్లోని దుస్తులకు అంటుకొని మెల్లిగా ఇంటి దులాలకు మంటలు అంటుకున్నాయి. కొంతసేపటికి పక్కనే ఉన్న అంజయ్య ఇంటికి కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో రెండు ఇండ్లు చూస్తుండగానే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విఠల్ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులతోపాటు రెండున్నర లక్షల డబ్బుతో పాటుగా, నాలుగన్నర తులాల నగలు, దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. 

మంగలి అంజయ్య ఇంట్లో ఉన్న వివిధ వస్తువుల కాలిపోవడంతో రూ.50వేల నష్టం వాటిల్లింది. రెండు ఇండ్లలో కలిపి మొత్తం రూ. 5.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కాలిపోయిన ఇండ్లను పోలీసులు, ఆర్ఎస్ఐ శ్రీకాంత్ సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.  

గుర్తు తెలియని మహిళ అస్థి పంజరం

గుర్తు తెలియని మహిళ అస్థి పంజరం లభించిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాలకల్ హద్నూర్-ఎల్గోయి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని హద్నూర్-ఎల్గోయి శివారు జాలవాగు సమీపంలో గుర్తు తెలియని మహిళా శవాన్ని చూసిన రైతులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్నారు. గుర్తు తెలియని మహిళ పూర్తిగా కుళ్లి పోయి అస్థిపంజరం మాత్రమే ఉందన్నారు. వయస్సు 50 వరకు ఉంటుందని, శవంపై నల్లని స్వెట్టర్, గులాబీ రంగు అకుల డిజైన్ ఉందన్నారు. పట్టు చీర పసుపు పచ్చరంగు కలిగి ఉందన్నారు. మహిళ చనిపోయి దాదా పు నాలుగు నెలలు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసి ఇక్క డికి తీసుకువచ్చి పడివేశారా..?.. లేదా అత్మ హత్యకు పాల్పడిందా.. ఇంకా ఏదైనా కార ణంతో మహిళ మృతి చెందిందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read :  బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment