ట్రాక్టర్ బోల్తా ..  ఇద్దరు మైనర్లు స్పాట్, ఆరుగురికి గాయాలు!

జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

New Update
tractor accident

జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సెరెంగాడగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెసాగ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.  ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో దాదాపు 12 మంది ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ సెరెంగాడగ్ నుండి పహాడ్ దండు వైపు వెళుతుండగా హెసాగ్ బత్రు వంతెన వద్దకు చేరుకునేసరికి, ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది.

Also read :  గుడ్ న్యూస్ ... తెలంగాణలో వారికి రేపటి నుంచి ఒంటిపూట బడులు

Also read :  Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా?

ఇద్దరు మైనర్లు స్పాట్

ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్ లో చనిపోయారు.  మృతులను 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల ఉరాన్  గా గుర్తించారు. ఇద్దరూ తురియాదిహ్ గ్రామ నివాసితులుగా గుర్తించారు. గాయపడిన వారిని అమీన్ ఒరాన్, రూపేష్ ఒరాన్, ప్రేమ్ లోహారా, పంకజ్ లోహారా , మంజీత్ ఒరాన్‌గా గుర్తించారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులందరినీ త్వరత్వరగా లోహర్దగాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ శంభునాథ్ చౌదరి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం లోహర్‌దగా సదర్ ఆసుపత్రికి పంపారు. 

Also read :  ఉమెన్స్‌ డే స్పెషల్.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళలతో సభ: మంత్రి సీతక్క

Also read :  13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment