ఎంత పని చేశావమ్మా..  భర్తను పోలీసులు తీసుకెళ్లారని

ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.  

New Update
Shaikh Baji

Shaikh Baji Photograph: (Shaikh Baji )

ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరికీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.  

షేక్ బాజీ అతని భార్య ప్రేజా  కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.  వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదు నెలల క్రితం బాజీ బైక్ మెకానిక్ గా పని చేసేందుకు కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లాడు. గతంలో బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో అతడిని పలుమార్లు  పోలీసులు విచారించినట్లు సమాచారం.

ఇటీవల ఓ దొంగతనం కేసులో ఇద్దరు పోలీసులు బాజీ ఇంటికి వచ్చి బైక్ తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. గురువారం ఉదయం వారు తిరిగి వచ్చి అతని ఇంటిని సోదా చేసి విచారణ కోసం తీసుకెళ్లారు. బాజీ భార్య, అతని తండ్రిని కూడా పోలీసులు ప్రశ్నించారు. 

దీనిని అవమానంగా భావించిన ప్రేజా  పోలీసులు వెళ్లాక తన ఇద్దరు బిడ్డలు మెహెక్ (6), మెనురూల్ (7) చీరతో ఉరేసి చంపేసింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.   గురువారం ఉదయం ఇంటి నుంచి ఎవరు కూడా  బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు  లోపలికి కెళ్లి చూడగా ముగ్గురు చనిపోయి ఉన్నారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  షేక్ బాజీ తరుచుగా దొంగతనాలు చేస్తుండటంతో  భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు చెబుతున్నారు.  దొంగతనాలు మానకపోతే పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోతానని కూడా బాజీకి ప్రేజా చెప్పినట్లు తెలిపారు.

అయితే పోలీసులు ఇంటికి రెండుసార్లు వచ్చి కుటుంబ సభ్యులను ప్రశ్నించడం వల్లే ప్రేజా ఈ దారుణానికి ఒడిగట్టిందని బాజీ బంధువులు ఆరోపించారు. బాజీ కుటుంబ సభ్యులు మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ కొనసాగింది.

Also Read :  భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment