Tenth Student: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది.

New Update
kAMAREDDY

kAMAREDDY Photograph: (kAMAREDDY)

తెలంగాణలోని కామారెడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లిలో ఓ విద్యార్థిని గుండె పోటుతో మరణించింది. పదవ తరగతి చదువుతున్న శ్రీనిధి(14) కామారెడ్డిలోని కల్కినగర్‌లో పెద్దనాన్న ఇంట్లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉంటూ చదువుతోంది. అయితే గురువారం స్కూల్‌కి బయలు దేరే సమయంలో ఉదయం ఇంటి దగ్గర తినకుండా బయలు దేరింది.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

స్కూల్‌కి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి..

స్కూల్‌లో తింటానని టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్లింది. నడుస్తూ స్కూల్‌కి వెళ్తున్న ఆ విద్యార్థిని పాఠశాల దగ్గరలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సీపీఆర్‌ చేసి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయిసరికి వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్తుండగానే మార్గమధ్యంలో ఆ విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

ఇదిలా ఉండగా తెలంగాణలో ఓ న్యాయవాది గుండె పోటుతో కోర్టులోనే మృతి చెందారు. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కూడా కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాదికి గుండె పోటు రావడంతో కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. వెంటనే గమనించి తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరమణ మృతి చెందారు. 

ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment