యువతి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఏం చేశాడంటే?

కరీంనగర్‌లో యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేశాడు. రామడుగు మండలానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. దీంతో తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చడంతో దాడి చేశాడు.

New Update
Karimnagar

Karimnagar Photograph: (Karimnagar)

యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన దారుణ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామడుగు మండలంలో రాజ్ కుమార్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది.

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

యువతి ఫిర్యాదు చేయడంతో..

రాజ్‌కుమార్‌ ఈ విషయం తెలుసుకుని ఆగ్రహానికి గురై తల్లిపై దాడికి పాల్పడ్డాడు. యువతి తల్లి గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. యువతి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్ పొలాలలో తెగి పడిపోయిన బాలిక శరీర భాగాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేరుకున్నారు.  ఫిబ్రవరి 27న డ్రోన్ నిఘా సహాయంతో సమీపంలోని పొలాల్లో బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా  బాలిక శరీరంలోని తెగిపోయిన కాలు, ఛాతీ నుండి తల వరకు పై మొండెం కనిపించాయి. 

ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. బాలికను గొంతు కోసి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. మొదట దీనిని అడవి జంతువుల దాడి కేసుగా అనుమానించినప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో మైనర్‌ను గొంతు కోసి చంపినట్లు తేలింది. 

ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి బూట్లలో ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

New Update
gold rates 123

Gold

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

 

Advertisment
Advertisment
Advertisment