/rtv/media/media_files/2025/04/06/vcddMaoFQPv5LQRRhB5U.jpg)
Ashes Photograph: (Ashes )
తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్తో ఉన్న రిలేషన్ను కట్ చేసుకున్నాడు.
Also read: Terrorists arrests: మణిపూర్లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్కు తిరిగి ఇచ్చారు. ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు.
Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు