Gambhiram Reservoir : గంభీరం రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల నాని కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ థర్డీయర్ చేస్తున్నాడు.

New Update
Student Dies  in Gambhiram Reservoir

Student Dies in Gambhiram Reservoir

Gambhiram Reservoir : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల.నాని(20) కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం నాని తన ఆరుగురు స్నేహితులతో కలిసి గంభీరం రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు. 

ఇది కూడా చదవండి: Biggest Flop Movie: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్‌.. రూ.800 కోట్ల నష్టం!


ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్ లో దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాని మునిగిపోవడంతో తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో కాపాడండి  అంటూ కేకలు వేశారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఓఎస్డీ ఫౌండేషన్‌ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నాని నీటిలో మునిగిపోయాడు. ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిజర్వాయర్‌ దగ్గరకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనందపురం సీఐ.సిహెచ్.వాసు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..  కుక్కతో ఆ పని చేయలేదన్న గురుమూర్తి!


కాగా గంభీరం పోలకొండ, పల్లిమెట్ట నడుమ ఏర్పాటుచేసిన గంభీరం రిజర్వాయర్‌ మల్ల అప్పారావు కొట్టు మడుగు చాలా ప్రమాదంగా తయారైంది. చుట్టూ ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు ఈ ప్రాంతానికి సరదాగా గడిపేందుకు వస్తుంటారు. అయితే ఈ మడుగులో దిగి ఈత కొట్టాలని ప్రయత్నించిన వందలాదిమంది విద్యార్థులు నీట మునిగి  మృతి చెందారు. సరదాగా ఈతకెల్లిన విద్యార్థులు ఊబిలో చిక్కుకుపోయి బయటికి రాలేక మృతిచెందుతున్నారు. ఇప్పటికే వందలాది మంది మృతి చెందినప్పటికీ ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులుగాని, నివారణ చర్యలు గాని అధికారులు చేపట్టడంలేదని స్థానికులు వాపోతున్నారు. నిత్యం ఈ ప్రాంతానికి వచ్చే విద్యార్థులు, మద్యం మత్తులో కొందరు రిజర్వాయర్‌లో దిగి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసి, పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment