/rtv/media/media_files/2025/03/14/4oRow5sq8fMdCKsrQZjA.jpg)
గుజరాత్ లోని వడోదరలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
#WATCH | Gujarat: On Vadodara accident, DCP Panna Momaya says, "... A car was moving from Sangam to Muktananad crossroad. It met with an accident while overspeeding. The police reached the spot and arrested one accused, Rakshit Ravish Chaurasia... Search to arrest the other… https://t.co/wR05gwBPuZ pic.twitter.com/hxRE39CGY1
— ANI (@ANI) March 14, 2025
డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా
కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన మహిళను హేమాలిబెన్ పటేల్గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో జైని (12), నిషాబెన్ (35), ఓ 10 ఏళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదంపై పోలీసులు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లీనా పాటిల్ మాట్లాడుతూ.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. ఇది మద్యం తాగి వాహనం నడపడం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. నిందుతుడి ఏమైనా మాదకద్రవ్యాలు తీసుకున్నాడా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?