TG News: మరో యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్.. నిజామాబాద్‌ లో ఘోరం

బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా ఆకుల కొండూర్‌‌లో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

New Update
betting app suicide

betting app suicide

TG News:  తెలంగాణలో మరో యువకుడు బెట్టింగ్ యాప్ లకు బానిసై ప్రాణాలు తీసుకున్నాడు. లక్షలు పోగొట్టుకొని.. చివరికి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వయసు పైబడిన తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన సమయంలో తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

పురుగుల మందు తాగి.. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ అనే యువకుడు కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్స్ కి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆన్ గేమ్స్ లో లక్షల రూపాయలు పెట్టి పోగోట్టుకున్నాడు. మొత్తం 5 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్థే ఏమవుతుందో అని భయపడిన ఆకాష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉంటే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ల నిర్మూలనపై కఠిన చర్యలు చేపట్టింది. ఎంతోమంది యువత చావులకు కారణమైన బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇన్ ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సెలెబ్రెటీల వరకు అందరి పై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే  విష్ణు ప్రియా, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, పల్లవి ప్రశాంత్, రానా, విజయ్ దేవరకొండ పలువురిపై కేసులు నమోదయ్యాయి. 

Also Read: ‘అమరావతికి ఆహ్వానం’... ఫ‌స్ట్‌లుక్‌తోనే బయపెట్టారుగా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment