అశ్లీల వీడియోలు చూపించి భార్యను టార్చర్..  ఏపీలో దారుణం

కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో  చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.  

author-image
By Krishna
New Update
vizag wife

nagendrababu (photo in twitter )

కొత్తగా పెళ్లి అయింది.  ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది అ యువతి.. కానీ ఆమె ఆశలన్నీ కొన్నాళ్లకే అడియాశలుగా మిగిలిపోయాయి. కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో  చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

 

Also Read :  మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?

11 నెలలు కిందట పెళ్లి

విశాఖలోని గోపాలపట్నం నందమూరి కాలనీకి చెందిన నాగేంద్రబాబుకు 11 నెలలు కిందట వసంతతో పెళ్లి అయింది. కామపిచ్చితో నాగేంద్రబాబు.. వసంతను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.  అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్‌ చేశాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకుని పలుమార్లు వాపోయింది వసంత.భర్త మారుతాడులే అని కొన్ని రోజులు ఓపిక పట్టింది.  పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో భరించలేకపోయింది. 

Also Read :  బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్‌ యాజమాన్యం దాడి

ఇదే విషయంపై గతరాత్రి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాపోయింది వసంత. అయితే రేపు వచ్చి మాట్లాడాతామని ఆమెకు ధైర్యం చెప్పారు కుటుంబ సభ్యులు. అయితే ఇంతలోనే వసంత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వారికి ఫోన్ వచ్చింది. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లిందండ్రులు, బంధువులు. అశ్లీల వీడియోలు చూపిస్తూ వసంతను టార్చర్ చేస్తున్నాడని..  కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. అత్త, మామ, మరిది, భర్త కలిసి వసంతను చంపేశారని ఆరోపిస్తున్నారు  కుటుంబ సభ్యులు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కే.జీ.హెచ్ కి తరలించారు.

Also read :  Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్‌ దాడి!

Also Read :  Donald Trump : బిగ్ షాక్..  మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్‌ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

New Update
Osaf Khan

Osaf Khan

Pahalgam Attack: జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీన వివాహం జరగ్గా వీరు హనీమూన్‌కి పహల్గామ్ వెళ్లగా.. ఉగ్రదాడికి బలి అయ్యాడు. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో లెఫ్టినెంట్ వినయ్‌తో పాటు మొత్తం 28 మంది మృతి చెందారు. అయితే పెళ్లయిన ఆరు రోజులకే భర్త చనిపోవడంతో.. మృతదేహం దగ్గర భార్య హిమాన్ష్ రోధించింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి దారుణంగా కామెంట్ చేశాడు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

వాస్తవాలు, అవాస్తవాలు ఏంటో పట్టించుకోకుండా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. హిమాన్ష్ బాధపడుతున్న ఫొటోకి కూడా జబల్‌పూర్‌కు చెందిన ఒసఫ్ ఖాన్ అనే వ్యక్తి ఓ కామెంట్ చేశాడు. ఈ మహిళపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌ను ఏర్పాటు చేసి కావాలనే తన భర్తను చంపించి ఉండవచ్చని అన్నాడు. దీంతో నెటిజన్లు ఒసఫ్‌పై మండిపడ్డారు. అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఒసఫ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment