Private Bus: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా.. 21 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
accident (1)1

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖార్గోన్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు. ఇందులో ఓ పసి బిడ్డ కూడా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

వారణాసిలోని రైల్వేస్టేషన్‌లో..

ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్‌ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

వెంటనే ఈ విషయం తెలియడంతో 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో వాహన యజమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమను ఎవరు ఆదుకుంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జిఆర్‌పి) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని వారు తెలిపారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని చౌదరి తెలిపారు. కాగా స్టేషన్‌లోని అసిస్టెంట్ లోకో పైలట్‌లలో ఒకరైన రవి రంజన్ కుమార్ వాహనం కూడా మంటల్లో దగ్దం అయ్యింది.

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు.

New Update
Jammu Kashmir encounter

Jammu Kashmir encounter

జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

Advertisment
Advertisment
Advertisment