వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

New Update
nepal23


నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆకస్మికంగా వచ్చిన వరదల వల్ల తూర్పు, మధ్య నేపాల్ ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. దీంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 170 మంది మరణించారు. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల్లో 43 మంది గల్లంతు కావడంతో పాటు 111 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే?

ముమ్మరంగా సహాయక చర్యలు

గత 40 నుంచి 45 ఏళ్లలో ఇలాంటి వరదలు ఎప్పుడూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. వరదల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మొత్తం 322 ఇళ్లు, 16 వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. హైవేలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలు, భవనాలు వరదలకు కొట్టుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు జలదిగ్భందంలో ఉన్నాయి. భాగమతి నది ఉగ్రరూపం దాల్చడం వల్లే ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు 4 వేల మందిని ఆర్మీ రక్షించింది. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ సంచలన నిర్ణయం.. లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment