దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ!

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22)  మృతదేహాం లభ్యమైంది.  మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు.  

New Update
 Himani Narwal

హర్యానాలో దారుణం జరిగింది.  రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22)  మృతదేహాం లభ్యమైంది.  మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మెడలో స్కార్ఫ్ చుట్టుకుని ఉండగా..  చేతులకు మెహందీ కూడా ఉంది. పార్టీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు.  హిమాని నర్వాల్ గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ 

ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రోహ్‌తక్ పీజీఐకి పంపారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశానని సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ విజేంద్ర సింగ్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసు హత్యగా కనిపిస్తోందని ఆయన అన్నారు.  హిమాని నర్వాల్ హత్యపై ఎమ్మెల్యే బిబి బాత్రా అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమె హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 

హిమాని నర్వాల్ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్త అని, పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని ఆయన అన్నారు.  హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా మాట్లాడుతూ  ఈ సంఘటనపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని..  దోషులకు కఠినమైన శిక్ష విధించాలన్నారు.  హిమాని నర్వాల్ హత్య  రాష్ట్రంలో సంచలనంగా మారింది.  

Also Read :  65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment