లవర్తో మాట్లాడుతూ దొరికిపోయింది..  ప్రశ్నించిన భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది!

భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను భార్య కట్ చేసిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లవర్‌తో మాట్లాడి దొరికిపోయిన భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి వ్యాగ్వాదం ముదిరింది. ఆగ్రహంతో భార్య ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది.

New Update
Bihar Crime

Bihar Crime Photograph: (Bihar Crime)

ఈ మధ్య కాలంలో మహిళ కంటే పురుషులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీహార్‌లోని హాజీపూర్‌లో ఓ భార్య తన భర్తకు తెలియకుండా ప్రియుడితో మాట్లాడుతుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ఆగ్రహానికి గురై భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది. దీంతో ఆ భర్త అక్కడిక్కడే చనిపోయాడు.

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

పోలీసులు అరెస్టు చేసి జైలుకి..

స్థానికులు, కుటుంబ సభ్యుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపించారు.ఆమెకు ప్రియుడు ఉండటం వల్ల భర్తతో సరిగ్గా ఉండేది కాదని, ఎక్కువగా గొడవలు పడేదని స్థానికులు అంటున్నారు. ప్రతీ చిన్న విషయానికి భార్య కోపానికి గురై గొడవ చేసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment