దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..

ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ  ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

New Update
madhya pradesh accident

madhya pradesh accident Photograph: (madhya pradesh accident )

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళ భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ కారులో తన భర్తతో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దురదృష్టకరమైన ఈ ఘటనలో ఆమె భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను  వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read :  Hyderabad: మహీంద్రా షోరూమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..భారీ ఆస్తి నష్టం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాతిబాద్‌కు చెందిన బబ్లీ అనే మహిళ గర్భవతి. ఆమెకు మంగళవారం అర్థరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో, ఆమె భర్త మహేంద్ర ఆమెను ఆల్టో కారులో తీసుకుని భోపాల్‌కు బయలుదేరాడు. కారులో వీరితో పాటు మహేంద్ర తల్లి, అత్త, బావ కూడా ఉన్నారు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో హలాల్‌పూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. మహేంద్ర తల్లి బటాషి బాయి చేతులు, భుజాలు మరియు కాళ్ళలో ఫ్రాక్చర్ కాగా, అతని సోదరికి కూడా గాయాలయ్యాయి. 

Also Read :  Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప

దీంతో వారందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు, అయితే వైద్యులు మహేంద్ర మేవాడ అతని బావమరిది సతీష్ చనిపోయినట్లు ప్రకటించారు. ఇది జరిగిన గంట తర్వాత, మహేంద్ర భార్య బాబ్లీ అర్థరాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం, తల్లి, నవజాత శిశువు ఇద్దరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు.  మహేంద్ర మూడు సంవత్సరాల క్రితం బాబ్లీని వివాహం చేసుకున్నాడు. వారికి ఇదే మొదటి సంతానం. ముగ్గురు తోబుట్టువులలో మహేంద్ర రెండవవాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు కోహ్-ఎ-ఫిజా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి బ్రజేంద్ర మార్స్కోల్ తెలిపారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.  

Also Read :  బీజేపీ నుంచి నాకు సీఎం ఆఫర్‌ .. మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment