Atul Subhash: బెంగళూరు టెకీ కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్టు

బెంగళూరు టెకీ ఉద్యోగి అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతని భార్య, అత్త, బావమరిదిని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. భార్య వేధింపులు భరించలేక 24 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

New Update
athul

భార్య వేధింపులు భరించలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతుల్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించనున్నారు. 

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

లేఖ రాసి ఆత్మహత్య..

బెంగళూరుకి చెందిన అతుల్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని 24 పేజీల లేఖను రాసి అతుల్ చనిపోయాడు. తప్పుడు కేసులతో భార్యలు వేధిస్తే.. భర్తలకు చనిపోవడం తప్ప మరొక దారి లేదని వాపోయాడు. భర్త ఉద్యోగం చేయకపోయిన జాబ్ చేస్తున్న భార్యకు భరణం ఇవ్వాలని తన బాధను వ్యక్తపరిచాడు. 

ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

మొదట కోటి రూపాయిలు ఇవ్వాలని అతుల్ భార్య డిమాండ్ చేసిందని ఆ తర్వాత రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని లేఖలో వెల్లడించాడు. చివరకు తన కొడుకును చూడటానికి కూడా రూ.30 లక్షలు డిమాండ్ చేసిందని అతుల్ ఆందోళన చెందాడు. కొందరు మహిళలు ఇలానే మగాళ్లను వేధించి వారి కన్నీటి చుక్కలతో డబ్బు పోగేసుకుంటున్నారని అతుల్ బాధపడ్డాడు.

ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

తన భార్య వేధింపులు భరించలేక నెల రోజులు ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. తన క్రెడిట్ కార్డు బిల్లులు, ఆఫీస్ వర్క్ అన్ని కూడా పూర్తి చేసి ప్లాన్ ప్రకారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆమె తప్పించుకుని తిరుగింది. చివరకు పోలీసుల చేతికి చిక్కింది. 

ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment