Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

నటుడు, యాక్షన్ స్టార్ 64 ఏళ్ల జీన్ క్లాడ్.. అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్రమ రవాణాకు గురైన ఐదుగురు రొమేనియన్ మహిళలను లైంగికంగా వాడుకున్నట్లు కేసు నమోదైంది. క్రిమినల్ నెట్‌వర్క్ నుంచి వారిని బహుమతిగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

New Update
romance

romance Photograph: (romance)

Viral News: ప్రముఖ నటుడు, యాక్షన్ స్టార్ జీన్-క్లాడ్ వాన్ డామ్.. అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్రమ రవాణాకు గురైన ఐదుగురి మహిళలతో లైగింక కోరికలు తీర్చుకుంటున్నట్లు రొమేనియాలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ 64 ఏళ్ల స్ట్రీట్ ఫైటర్.. మోరెల్ బోలియా నేతృత్వంలోని క్రిమినల్ నెట్‌వర్క్ నుంచి ఐదుగురు రొమేనియన్ మహిళలను బహుమతిగా స్వీకరించాడని రొమేనియన్ అధికారులు డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం (DIICOT)కు ఫిర్యాదు చేశారు.

క్రిమినల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి..

ఈ మేరకు ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో వాన్ డామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ఆ మహిళల్లో ఒకరి  సాక్ష్యం ఆధారంగా DIICOT దర్యాప్తు ప్రారంభించింది. బాధితుల్లో ఒకరి తరపున వాదించిన న్యాయవాది అడ్రియన్ కుకులిస్.. 'ఆ మహిళలు దుర్బల స్థితిలో ఉన్నారు. దోపిడీకి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, అతనికి ఐదుగురు రొమేనియన్ మహిళలను ఆఫర్ చేశారు' అని చెప్పారు. ఇక 2022లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై ఆండ్రూ, ట్రిస్టన్ టేట్ అరెస్టయి ఇటీవలే దేశం విడిచి వెళ్లిన తర్వాత రొమేనియాలో ఇది రెండవ హై ప్రొఫైల్ కేసుగా పేర్కొన్నారు. 

యూరోపియన్ కరాటే ఛాంపియన్‌..

జీన్-క్లాడ్ వాన్ డామ్ ఒక బెల్జియన్ మార్షల్ ఆర్టిస్ట్, నటుడు. 1960లో బెల్జియంలో జన్మించిన ఆయన 1980లలో హాలీవుడ్‌కు వెళ్లే ముందు కరాటే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. చిత్రనిర్మాతగా బ్లడ్‌స్పోర్ట్ (1988), కిక్‌బాక్సర్ (1989), యూనివర్సల్ సోల్జర్ (1992) వంటి యాక్షన్ చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు చేరినప్పటికీ అతను మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టపరమైన సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతను కొకైన్‌కు బానిసయ్యాడు. ఒకసారి తాగి వాహనం నడపడం, గృహ హింస కారణంగా అరెస్టు అయ్యాడు. యుక్తవయసులో కరాటేలో రికార్డులు సృష్టించిన ఇతను.. 44 విజయాలు, 4 పరాజయాలు చవిచూశాడు. 1979లో యూరోపియన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న బెల్జియం కరాటే జట్టులో సభ్యుడు కూడా.

 sexual-assault | actor | case | telugu-news 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
ACCIDENT

ACCIDENT

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మ‌ృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ముగ్గురు మృతి..

ఇదిలా ఉండగా ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment