పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్యం జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. ల

New Update
marriage-4

marriage-4

డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి ట్రాప్ చేసి నలుగురు యువకులను మోసగించింది. ఇప్పటికే ముగ్గురిని మోసం చేయగా..  తాజాగా మరో వ్యక్తిని మోసం చేయగా ఈ నిత్య పెళ్లికూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్య జిల్లా మద్దూరు జిల్లా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె వైష్ణవి, ఇదే జిల్లా మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన శశికాంత్‌ ఎనిమిది నెలలుగా ప్రేమించుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్నారు. 

Also read :  హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు నైజీరియన్లు అరెస్టు

తాము చాలా పేదావాళ్లమంటూ

అయితే వివాహానికి ముందే తాము చాలా పేదావాళ్లమంటూ అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రాముల బంగారం కాజేసింది. 2025 మార్చి 24న ఆదిచుంచనగిరి క్ష్రేత్రంలో వీరి పెళ్లి జరగ్గా మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరె చాముండేశ్వరి ఆలయానికి కారులో బయల్దేరారు. అయితే ఉమ్మడిహళ్లి గెట్‌ వద్ద వాటర్‌ బాటిల్‌ కోసం శశికాంత్‌ కారు దిగగా.. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి జంప్ అయింది.  

Also read :  Rohit Sharma : వేటు వేశారా.. లక్నోతో మ్యాచ్లో రోహిత్‌ ఎందుకు ఆడలేదు?

శశికాంత్‌  వచ్చి చూసేసరికివైష్ణవి కనిపించకుండా పోవడంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని విచారణలో తెలిసింది. ధర్మస్థలలో హాసన్‌కు చెందిని రఘుతో మొదటి పెళ్లి,  శివతో రెండో పెళ్లి, రఘతో మూడో పెళ్లి జరిగిందని.. ఇలా ముగ్గురిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బు, నగలతో పరార్ అయినట్లుగా కేసులు నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు.

Also Read : Sri Varshini - Aghori: అఘోరీ శవం తినడం నేను చూశాను - అంతా చెప్పేసిన వర్షిణీ!

Also read :  Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment