Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా?

తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా?

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న.. లేకున్నా పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించడం లేదని వాపోతున్నారట. అయితే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు జైవీర్‌రెడ్డి కి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని.. గెలిపించుకున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.

ALSO READ: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభ ఆశ.. నిరాశే!

కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా ఉన్న తనకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు ఇస్తుందని అనుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి. అయితే.. నిన్న (బుధవారం) కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి పోటీ చేసే రాజ్యసభ సభ్యుల లిస్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తనకే రాజ్యసభ టికెట్ ఇస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన జానారెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. దీంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై గుస్సా అయినట్లు సమాచారం. సీనియర్ లీడర్ అయినా తన పేరు కాకుండా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే!

మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజ్యసభ టికెట్ ఆశించి భంగపడ్డ జానారెడ్డి.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాజ్యసభ రాలేదు కనీసం లోక్ సభకు వెళ్లేందుకు తనకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు జానారెడ్డి. ఎన్నికల్లో తనకు కాకపోయినా తన కుమారుడు రఘురెడ్డికి సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తునట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్ ను గతంలో పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెప్పిన విషయం తెలిసిందే. ఎంపీ టికెట్ రాకపోతే జానారెడ్డి తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో అనేక చర్చలకు దారి తీస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen-KA Paul: ట్రంప్ కు చెప్పా.. తర్వాత చచ్చే ఆ 100 మంది వీళ్లే.. కేఏ పాల్ సంచలన ప్రెస్ మీట్!

పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

ఎస్పీతో చంద్రబాబు ఎందుకు మాట్లాడారు..?

ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారు..? అని అనుమానం వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు..? అని ఫైర్ అయ్యారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ట్రాంప్ దృష్టికి తీసుకుని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. ప్రవీణ్ మద్యం తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 

(Pastor Praveen | telugu-news | telugu-latest-news )

Advertisment
Advertisment
Advertisment