Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్‌ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఫరూఖ్‌ నగర్‌ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్‌ నగర్‌ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్‌ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫరూఖ్‌ నగర్‌ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్‌ నగర్‌ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

అనంతరం ఆ యువతి ప్రయాణ సమయంలో ఒక కండక్టర్‌ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఎక్స్ ( ట్విట్టర్ )లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కండక్టర్‌ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, కండక్టర్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Also read: పేరు మార్చుకున్నా ముద్రగడ..ముద్రగడే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: రైస్ మిల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!

ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.

New Update
rice mill

East Godavari rice mill lectric shock issue

AP Crime: ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ట్రాలీలో రైస్ తీసుకొస్తుండగా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం పైన, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని, విద్యుత్ అధికారులు వైర్లు కిందకు ఉన్నా పట్టించుకోకపోవడం తో ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు తమముందు కన్నీటి పర్యాంతమయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని, వైసీపీ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇలాంటి ఘటన మళ్లీ పునరవృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

 rice | power | shock | today telugu news

Advertisment
Advertisment
Advertisment