Technology: మనిషి మెదడుతో కంప్యూటర్..స్విస్ శాస్త్రవేత్తల సృష్టి

టెక్నాలజీ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ఎంతలా అవుతోందో...ఎక్కడికి చేరుకుంటుందో కూడా ఊహించడం కష్టంగా ఉంటోంది. తాజాగా మానవ మెదడులోని కణజాతం ఆధారంగా కంప్యూటర్ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు.

New Update
Technology: మనిషి మెదడుతో కంప్యూటర్..స్విస్ శాస్త్రవేత్తల సృష్టి

New Invention: ఇప్పటివరకు ఒక లెక్క...ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు స్విస్ శాస్త్రవేత్తలు. కంప్యూటర్ సృష్టికే కారణమైన మానవ మెదడునే కంప్యూటర్‌గా మార్చేశామని చేసి చూపిస్తున్నారు. బ్రెయినోవేర్ అనే పరుతో మనిషి మెదడులోని కణజాలంతో సజీవ కంప్యూటర్ సృష్టించామని ప్రకటించారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను కలిపి దీన్ని సృష్టించడంతో రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్‌ అనే పేరు పెటంటామని చెబుతున్నారు. కంప్యూటర్ చిప్ మాదిరిగా సమాచారాన్ని పంచుకునే సామర్ధ్యం ఉండడం దీని ప్రత్యేకత. ఈ కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించగలదని వివరించారు.

అయితే ఈ బ్రెయినోవేర్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. దీనిని అందుబాటులోకి తీసుకురావాలంటే చాలా చిక్కులను అధిగమించాలి. అసలు అయితే ఈ కొత్త ఇన్నేవోషన్ కంప్యూటర్ సైన్స్, స్యూరో సైన్స్లలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ మధ్య అంతరాలను చెరిపివేస్తుంది. సామర్థ్యం, కంప్యూటింగ్ పరంగా దీని ప్రయోజనాలు అపారంగా ఉంటాయి. అయితే దీన్ని డెవలప్ చేయడం అంత సులువేమీ కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధ్యాసాధ్యాలపై మానవ ఆలోచనలను ఇది సవాల్ చేస్తుంది. ఇది మానవ మేధకు పెద్ద సవాలుగా మారుతుంది. కృత్రిమ మేధస్సు, టెక్నాలజీతో మానవత్వం భవిష్యత్తు గురించి కూడా లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అప్పుడు దీన్ని మనుషులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ప్రశ్నగా మారుతుందని అంటున్నారు.

Also Read:Whats App: మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లు..వాట్సాప్‌లో మరో అప్డేట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment