CM Revanth: ఆ వివరాలన్నీ బయటకు తీస్తా.. కాళేశ్వరంపై కాక రేపుతోన్న రేవంత్‌ కామెంట్స్!

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు.

New Update
CM Revanth: ఆ వివరాలన్నీ  బయటకు తీస్తా.. కాళేశ్వరంపై కాక రేపుతోన్న రేవంత్‌ కామెంట్స్!

CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు.

Also Read: 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ

కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని సభను హరీశ్ రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొమ్మిదిన్నరేళ్లు సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉందని అయితే ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం కాళేశ్వరం కోసమే రూ. 80 వేల కోట్ల రుణం తీసుకున్నారని.. ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టిందని వెల్లడించారు.


కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చెప్పి రుణాలు తీసుకున్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించి కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టారని..అయితే ఆ సంతకాలు పెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment