Andhra University : ఆంధ్రా యూనివర్శిటీ వద్ద టెన్షన్ టెన్షన్.. ఆయనపై చర్యలకు డిమాండ్‌!

విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

New Update
Andhra University : ఆంధ్రా యూనివర్శిటీ వద్ద టెన్షన్ టెన్షన్.. ఆయనపై చర్యలకు డిమాండ్‌!

Andhra University Students : ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, స్టాఫ్‌ను నాటి వైసీపీ (YCP) సర్కార్‌ అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఎంపీ సీఎం రమేశ్‌ (CM Ramesh) విమర్శించారు. AU మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు రమేశ్‌. అతన్ని వదిలిపెట్టే సమస్య లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఇదే సమయంలో విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున యూనివర్శిటీ వద్దకు వచ్చారు. ప్రసాద్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే విద్యార్థి సంఘం నేతలతో సీఎం రమేశ్‌ మాట్లాడు. ప్రసాద్‌ రెడ్డి రాజీనామా (Resign) చేసినా ఆయన్ను వదిలేది లేదని రమేశ్‌ తెలిపారు.

రమేశ్‌ ఇంకా ఏం అన్నారంటే?

• ప్రసాద్‌రెడ్డి చేసినవి ప్రతిదీ లెక్క ఉంది... అన్ని లెక్కలు తెలుస్తాం!

• రాజీనామా చేసినంత మాత్రాన వదిలిపెట్టే సమస్య లేదు

• భారతదేశంలో పేరున్న యూనివర్శిటీలో AU ఒకటి ?

• ఇలాంటి విద్యాసంస్థలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టవచ్చా?

• ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకెవరైనా ఉంటే వారిని కూడా వదిలిపెట్టను

• అతన్ని వెంటనే శిక్షించాలని గవర్నర్ ను, అలాగే ప్రభుత్వాన్ని కోరుతున్నా..!

• జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఎలా చెప్తే ప్రసాద్ రెడ్డి అలానే చేశారు....

• దాదాపు 100 కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేశారు....

• వెంటనే అతన్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం...

• అతను చేసిన తప్పులు బయటపెడతాం!

Also Read: లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
ttd crime news

ttd crime news

AP Crime: తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డుప్రమాదం భక్తుల్లో ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ఏడుగురు కర్ణాటకకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని తిరుపతికి తిరుగుబాటుగా బయలుదేరిన ఈ వాహనం అతి వేగంగా వచ్చిన సమయంలో మలుపులో నియంత్రణ కోల్పోయింది. వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగంతో..

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు, 108 ఎమర్జెన్సీ సర్వీసులకు అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను బయటకు తీసి చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతావారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడిపిస్తున్నాడని, కొన్ని సార్లు మలుపుల్లో కాస్త భయంగా అనిపించినట్లు గాయపడిన ఓ భక్తుడు తెలిపారు.

 

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల వేగంపై నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

( ap-crime-news | ap crime updates | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు