CM Jagan : నేడు ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పి.. అలాగే వారికి కొన్ని బహుమతులను అందజేయనున్నట్లు సమాచారం.

New Update
CM Jagan : నేడు ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్

IPAC : ఏపీలో ఎన్నికల(AP Elections) హడావిడి ముగిసింది. పలుచోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ(Vijayawada) బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్(CM Jagan) వెళ్లనున్నారు. గతంలో 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సీఎం జగన్.. హైదరాబాద్‌లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. 2019లో వైసీపీ(YCP) వైపు ఐ ప్యాక్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వైసీపీ వైపు ఐ ప్యాక్ పనిచేసింది. దీంతో ఈసారి కూడా సీఎం జగన్ ఆ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగులను కలవనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పి.. అలాగే వారికి కొన్ని బహుమతులను అందజేయనున్నట్లు సమాచారం.

Also Read: నేటి నుంచే ఈఏపీ సెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

మరోవైపు ఈ నెల 17న సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. మే 17 నుంచి జూన్ 1 వరకు లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని.. జగన్ సీబీఐ కోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన సీబీఐ కోర్టు.. జగన్ విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇచ్చింది.

Also Read: వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు