తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం (ఆగస్టు 11న) అమలాపురంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకులు మోసపోయారని , వారు బాకీ పెట్టిన సొమ్మున్నంతటిని మేము తిరిగి చెల్లించామని అన్నారు.
పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు.
సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు
చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు.పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులకు నరకం చూపించారు
చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారని జగన్ ఆరోపించారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అధికారం కోసం చంద్రబాబు అర్రులు చాస్తున్నారని, మరోసారి సీఎం కావాలని ఆశపడుతున్నారని అన్నారు. ఆయన సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని వ్యాఖ్యానించారు.
బాబు శవరాజకీయం
అలాగే మొన్నటి పుంగనూరు ఘటన విషయానికొస్తే ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టుకున్నారని చెప్పుకున్నారు.
శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు బావుండాలని మీరు కోరుకుంటే చంద్రబాబుకు ఓటు వేయొద్దని సూచించారు.
చంద్రబాబు అంటే మోసాలు, వెన్నుపోట్లు : సీఎం జగన్!
కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.
తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం (ఆగస్టు 11న) అమలాపురంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకులు మోసపోయారని , వారు బాకీ పెట్టిన సొమ్మున్నంతటిని మేము తిరిగి చెల్లించామని అన్నారు.
పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు.
సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు
చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు.పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులకు నరకం చూపించారు
చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారని జగన్ ఆరోపించారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అధికారం కోసం చంద్రబాబు అర్రులు చాస్తున్నారని, మరోసారి సీఎం కావాలని ఆశపడుతున్నారని అన్నారు. ఆయన సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని వ్యాఖ్యానించారు.
బాబు శవరాజకీయం
అలాగే మొన్నటి పుంగనూరు ఘటన విషయానికొస్తే ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టుకున్నారని చెప్పుకున్నారు.
శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు బావుండాలని మీరు కోరుకుంటే చంద్రబాబుకు ఓటు వేయొద్దని సూచించారు.
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ముంబై నుంచి హీరోయిన్ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి పి.ఎస్.ఆర్.ఆంజనేయులుని ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?
ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)
విజయనగరంలోని 'రఘు ఇంజనీరింగ్ కాలేజీలో' విద్యార్థిని టీచర్ ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ గా మారింది. టీచర్.Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!
ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, కిరీటాన్ని.... క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
DC vs LSG : రాణించిన మార్క్రమ్, మార్ష్.. ఢిల్లీ టార్గెట్ 160
Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)
J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'