Maha kumbh 2025: కుంభమేళాకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్!

హీరో విజయ్ దేవరకొండ మహా కుంభమేళను సందర్శించుకున్న ఫొటోలను పంచుకున్నారు. విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కుంభమేళాకు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం అయన భార్య మాత్రమే వెళ్లారు.

New Update
vijay devarakonda kumbhamela

vijay devarakonda kumbhamela

Maha kumbh 2025: హీరో విజయ దేవరకొండ ప్రయాగ్ రాజ్ లో నెలకొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళాను ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే విజయ్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబం కూడా కుంభమేళా వెళ్లారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళాకు అల్లు అర్జున్ వెళ్ళలేదు. కేవలం ఆయన భార్య మాత్రమే విజయ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.  ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభమేళా ఉత్సవం మరో తొమ్మిది రోజుల్లో ముగియనుంది. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రైల్వే స్టేషన్స్, బస్ స్టాపుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు. 

Also Read: Tejaswi Madivada: తేజస్వి అందాల విధ్వంశం.. క్రీమ్ కలర్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న బ్యూటీ

 'కింగ్ డమ్'

ఇక విజయ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  'కింగ్ డమ్' సినిమా చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా  భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.  ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా కనిపించింది. 'ఆ అలజడి ఎవరికోసం' అంటూ తారక్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. టీజర్ తోనే 1000 కోట్లు పక్కా అంటున్నారు ఫ్యాన్స్.  ఈ సినిమాతో విజయ్ కమ్ బ్యాక్ గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.  ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment