Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ కు.. ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని సినీ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండించగా.. ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
urvashi rautela

urvashi rautela saif ali khan

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ కు.. ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని సినీ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండించగా, తన తాజా సినిమా డాకు మహారాజ్ సక్సెస్‌లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ గురించి వ్యాఖ్యానించారు. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105 కోట్ల వసూళ్లతో మంచి విజయం సాధించింది. మా అమ్మ నాకు డైమండ్ ఉంగరం బహుమతిగా ఇచ్చారు. 

అలాగే నా తండ్రి ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. అయితే, ప్రస్తుతం వాటిని ధరించి బయటకు వెళ్లడం భయంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్‌) చేస్తారనే భయం ఉండటంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఊర్వశి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆమె సైఫ్ కు క్షమాపణ చెప్తూ నోట్‌ విడుదల చేశారు." సైఫ్ అలీ ఖాన్ సర్‌కి నా క్షమాపణలు. ఈ పోస్ట్‌ మీ వరకు చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడేటప్పుడు నేను అనుచితంగా వ్యవహరించాను. ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు అవగాహన లేదు. 

డాకు మహారాజ్ విజయం కారణంగా ఆనందంలో ఉన్న నేను, ఆ సక్సెస్‌ వల్ల వచ్చిన బహుమతుల గురించి మాట్లాడటం అభాసుపాలైంది. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది. మీపై గౌరవంతో...’’ అంటూ పేర్కొన్నారు.

Also Read: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment