RGV : సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్

'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్‌ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు.

New Update
rgv001

'పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ  ఘటనపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు.  

ఈ విషయంలో హీరో అల్లు అర్జున్‌ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో తొక్కిసలాట ఘటనలు ఎన్నో జరిగాయని గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు." భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నప్పుడే తొక్కిసలాట ఘటనలు జరుగుతాయి. ఇలాంటివి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా? లేదా నిర్లక్ష్యం, అసమర్థత వల్ల జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనేది పూర్తిస్థాయి దర్యాప్తుతోనే తెలుస్తుంది. 

అది పరిష్కారం కాదు..

గతంలో ఇలాంటి ఘటనలు జరిగి వేల సంఖ్యలో మరణాలు సంభవించినప్పుడు వివిధ కారణాల వల్ల ఏ ఒక్కరినీ నిందించలేదు. ఈ ఘటనను దృష్టిలోఉంచుకొని బెనిఫిట్‌ షోలను బ్యాన్‌ చేయడం సమస్యకు పరిష్కారం కాదు. వరదల బాధితులకు, లేదా ఎవరికైనా విరాళం అందించేందుకు గతంలో బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను డబ్బు చేసుకోవడమే ఈ షోల ముఖ్యఉద్దేశం. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేనప్పుడు వీటిని స్పెషల్‌ షోలు అని పిలవాలి. 

Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

సాధారణ భోజనం, కాఫీలతో పోలిస్తే స్పెషల్‌ మీల్స్‌, కాఫీకి ఏవిధంగా అయితే ధర అధికంగా ఉంటుందో అదేవిధంగా స్పెషల్‌ షో టికెట్‌ రేట్లు కూడా అత్యంత ఖరీదుగా ఉంటాయి. రాజకీయ ర్యాలీలు, మీటింగ్స్‌కు ఏవిధంగా అయితే పర్మిషన్‌ ఇస్తారో అదేవిధంగా సినిమా ప్రదర్శనలకు కూడా పలువురు అధికారుల ఆమోదం ఉండాలి. సినీ తారలు థియేటర్లను విజిట్‌ చేయడం ఎంతోకాలం నుంచి జరుగుతుంది. వారిని చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. 

వారే బాధ్యత వహించాలి..

ఒక స్టార్ థియేటర్‌ విజిట్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే దానిపై పోలీసులు లేదా థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి. అంతేకానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి? దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ సినిమా బెనిఫిట్‌ షోలు ప్రదర్శించారు. అల్లు అర్జున్‌ కేవలం ఒక్క థియేటర్‌కు మాత్రమే హాజరయ్యాడు. అక్కడే ఈ ఘటన జరిగింది. 

సరైన నిర్ణయం తీసుకోవాలి..

కాబట్టి స్టార్‌ విజిట్‌ చేసే థియేటర్‌ వద్ద ఆంక్షలు పెట్టకుండా బెనిఫిట్‌ షోలే పూర్తిగా రద్దు చేయాలనుకోవడం చూస్తుంటే.. ఒక ప్రమాదం జరిగిందని వాహనాలను రోడ్ల పైకి రావద్దన్నట్లు ఉంది. దీనివల్ల సమస్య తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. రాజకీయ సమావేశాలు, మేళాల్లో తొక్కిసలాట జరిగితే.. వాటిని ఎప్పుడైనా పూర్తిగా రద్దు చేశారా? అధికారులంతా ఈవిధంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment