RC16: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. శివన్న లుక్ టెస్ట్ కంప్లీట్! వీడియో చూశారా..

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న #RC16లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా శివ రాజ్ కుమార్ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

New Update
rc16 Shiva raj kumar look test

rc16 Shiva raj kumar look test

RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #RC1. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఇందులో జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తదితర స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్నారు. 

Also Read: RC16: జాను పాప చేతిలో గొర్రెపిల్ల.. రామ్ చరణ్ RC16 నుంచి అదిరే పోస్టర్!

శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్.. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం లుక్ టెస్ట్ కి సంబంధించిన వీడియోను పంచుకుంది. ''#RC16 కోసం కరుణాడ చక్రవర్తి @నిమ్మశివన్న లుక్ టెస్ట్  పూర్తయింది. ఆయన తన పాత్ర కోసం అద్భుతమైన మేకోవర్ కు సిద్ధంగా ఉన్నారు.  అది ఎంతో ఉత్కంఠభరితంగా, సంచలనాత్మకంగా ఉండబోతుంది'' అని ట్వీట్ చేశారు. దీంతో శివన్న లుక్ ఎలా ఉండబోతుందా? అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ భిన్నమైన మేకోవర్ లో కనిపించబోతున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చరణ్ కు మేకోవర్ చేశారు. దీనిని నిర్మాతలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని భారీ లుక్ అని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ షెడ్యూల్ ముగిసిన  తర్వాత.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంఘాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంఘాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.  

 rtv-news | trump | china | national-news 

Advertisment
Advertisment
Advertisment