kannappa postponed: కన్నప్ప వాయిదా.. మంచు విష్ణు బిగ్ షాక్!

మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్‌ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు.  

author-image
By Krishna
New Update
kannappa postponed

kannappa postponed

మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్‌ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు.  ఇందుకు ఆయన సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. వాస్తవానికి 2025 ఏప్రిల్‌ 25న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను కూడా మంచు విష్ణు ప్రకటించలేదు. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. 

Also read :  భర్త దుబాయ్లో సంపాదిస్తే..  భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి

భారీ బడ్జెట్‌తో కన్నప్ప

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. దీనికోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ భాగమవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రీతి ముకుందన్‌ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది.

Also read :  రేషన్ కార్డులదారులకు గుడ్‌ న్యూస్‌..ఆ గడువు పొడిగింపు

ఇక ఇందులో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్  మోహన్‌లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియాస్ మోస్ట్ పాపులర్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తుండగా.. మెలోడీ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్వయంగా మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!

Also read :  చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment