Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్‌ ఇంటికి కరెంట్ కట్

జల్‌పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్‌క్‌ ఇంటికి చెందిన జనరేటర్‌లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్‌ ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ మొదలైంది. జల్‌పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్‌ ఇంటికి చెందిన జనరేటర్‌లో విష్ణు పంచదార పోయించడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. పహాడీషరీఫ్ పీఎస్‌కు వెళ్లారు. విష్ణుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. '' శనివారం నేను షూటిగ్‌లో ఉన్నాను. నా కొడుకి స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌కు నా భార్య వెళ్లింది. మా అమ్మ బర్త్‌డే సందర్భంగా విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో వచ్చాడు. జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్ సరఫా నిలిపివేశారని'' మనోజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

Manchu Family Fight

ఇదిలాఉండగా.. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మోహన్‌బాబు ఇంటికి మనోజ్ తన అనుచరులతో కలిసి గేట్లు తోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత మోహన్‌బాబు ఓ జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేయడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జరిగిన తర్వాత మోహన్‌ బాబు ఓ ఆడియోను కూడా రిలీజ్‌ చేశారు. తాను కావాలని దాడిచేయలేదంటూ చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టును ఆదివారం మోహన్ బాబు, విష్ణు  పరామర్శించారు. 

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

ఇదిలాఉండగా.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వల్లే గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. మోహన్‌బాబు యూనివర్సిటీ బాధ్యతలు మొత్తం విష్ణుకే అప్పగించడంతో.. వర్సిటీలో జరుగతున్న అవకతవకలపై గతంలోనే మనోజ్‌ లేవనెత్తారు. అలాగే జల్‌పల్లి ఫామ్‌హౌస్‌ కూడా మనోజ్‌కు దక్కకుండా చేస్తున్నారనే వాదన ఉంది. ఈ విషయాల వల్లే మోహన్‌బాబు, మనోజ్‌ల మధ్య గొడవలకు దారీ తీశాయనే ప్రచారం నడుస్తోంది.    

Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.

New Update
Maruthi Raja Saab Tweet

Maruthi Raja Saab Tweet

Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.  

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

HIGH ALERT…!!

చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.

Maruthi Raja Saab Tweet
Maruthi Raja Saab Tweet

 

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.

ఈ భారీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్నారు.

 

 

Advertisment
Advertisment
Advertisment