Mahesh Babu: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!

SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు.

New Update
Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: మహేష్ రాజమౌళి(Rajamouli) కంబోలో తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొస్తున్నాయి. రాజమౌళి అక్కడి కొండలపై  ట్రెక్కింగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయగా, మహేష్ బాబు మహేష్ బాబు పర్యావరణాన్ని కాపాడటం కోసమై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో  సూపర్ స్టార్ పిక్స్ ఇంటర్నెట్ ను షాక్ చేస్తున్నాయి. కొత్త లుక్ లో మహేష్ అల్ట్రా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు.

Also Read: సూర్య ఫ్యాన్స్ కు 'రెట్రో' ట్రీట్.. మరో సాంగ్ రిలీజ్..

పర్వత బాటలో మొక్కలు నాటి..!

SSMB29 షూటింగ్ రెండు రోజుల క్రితం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి ఫోటోలు , షూటింగ్ వీడియోలు చాలానే లీకుల భారిన పడుతున్నాయి, కాగా తాజాగా ఒడిశాలో పూర్తి చేసుకున్న షెడ్యూల్ నుండి కూడా వీడియో ఒకటి లీక్ అయ్యింది. సెట్‌లో మహేష్, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..

అయితే SSMB29 1000 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత KL నారాయణ నిర్మిస్తుండగా. ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2026 లేదా 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. 

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Retro Trailer Update: సూర్య 'రెట్రో' ట్రైలర్ వచ్చేస్తోంది..

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన "రెట్రో" మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా, శ్రియా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండగా, ఈ సినిమా మే 1న  HIT 3, రైడ్ 2తో పోటీ పడుతుంది.

New Update
Pooja Hegde in Retro

Retro Trailer Update

Retro Trailer Update: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’తో మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మే 1, 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

అయితే, ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అనుకున్నారు సినీ అభిమానులు. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇస్తూ ఇది యాక్షన్‌తో కూడిన ఓ ప్రేమకథ అని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రెట్రో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి,” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఏప్రిల్ 18న ట్రైలర్‌ రిలీజ్..

ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవగా, థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.

చిత్రంలో శ్రియా శరణ్ ప్రత్యేక గీతంలో మెరవనుండగా, జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ పనిచేస్తున్నారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

‘రెట్రో’ మే 1న విడుదలై అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న HIT 3, రైడ్ 2 సినిమాలతో పోటీ పడనుంది. సూర్య అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న తరుణంలో, ఈ లవ్ – యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

Advertisment
Advertisment
Advertisment