/rtv/media/media_files/2025/01/16/kzhKXbvslLNaNYI803g2.jpg)
ntr and saif Photograph: (ntr and saif)
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్పై జరిగిన దాడి గురించి విని షాక్కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన పాన్-ఇండియా చిత్రం దేవరలో సైఫ్ విలన్ గా నటించారు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
— Jr NTR (@tarak9999) January 16, 2025
Wishing and praying for his speedy recovery and good health.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా వెస్ట్లోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్పై దాడికి దిగాడు. ఆర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పనిమనిషికి చిక్కాడు. దీంతో దొంగకు, పనిమనిషికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం
ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి చూసి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో సైఫ్ పై ఎటాక్ చేశాడు. ఆరు సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడినుంచి పారరయ్యాడు. వెంటనే సైఫ్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్లు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు.
Also Read : కరీనా లేని టైమ్ చూసి ఎటాక్.. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది వాళ్లేనా?