Balayya: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు?

నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. బాలయ్యను పద్మ భూషణ్ వరించనుందట. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్‌ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
balya

నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. వారి అభిమాన హీరో బాలకృష ను పద్మ భూషణ్ వరించనుందట. ఈ న్యూస్ అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సినీ రంగంలో 50 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. తన కెరీర్ లో 108 సినిమాలు చేశారు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ 'అన్ స్టాపబుల్' షోతో రికార్డు క్రియేట్ చేశారు. ఇటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 

ఏపీలో హిందూపూర్ ఎమ్మెల్యే గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు యునానిమస్ గా ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. అలాగే తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను ప్రభత్వం గుర్తించి త్వరలోనే బాలయ్యకు పద్మ భూషణ్ పురష్కారం అందజేయనుందట.

Also Read : సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. 7 వారాల్లో అన్ని లక్షలు సంపాదించాడా?

చిరు తర్వాత బాలయ్యే..

సినీ పరిశ్రమ నుంచి  ఈ పురష్కారం ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మా పుష్కరాలు అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలు అందనున్నాయి. 

Also Read : దేశాలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. 'గేమ్ ఛేంజర్' సాంగ్ కు కొరియన్స్ డ్యాన్స్

అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్‌ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న సినీ విశ్లేషకులు పద్మ భూషణ్ అవార్డుకు బాలయ్య అర్హుడని అభిప్రాయపడుతున్నారు. 

Also Read :  నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Also Read :  కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment