Nagarjuna: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్‌ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు.

New Update
akhil marriage

Nagarjuna: అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్‌ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు.తన కుటుంబంలో వరుస శుభకార్యాలు జరగడం పై నాగార్జున ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

Also Read: Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

ఈ ఏడాది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఓ వైపు నాన్నగారి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరో వైపు నా కుమారులిద్దరూ జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ 4న చైతూ శోభిత పెళ్లి జరగనుంది.పెళ్లి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నా తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉందని వివరించారు. మా కుటుంబం ఎంతో పెద్దది. అదే విధంగా శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదే. కుటుంబ సభ్యులు, తక్కువ మంది అతిథుల సమక్షంలో గ్రాండ్‌ గా చేయాలనుకుంటున్నాం. మా రెండో అబ్బాయి అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.

Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

జైనబ్‌ ఎంతో మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమనం కలిగి ఉంటుంది. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్‌ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదు. ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అని నాగార్జున చెప్పారు.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

అఖిల్‌ జైనబ్‌ నిశ్చితార్థం జరిగినట్లు మంగళవారం నాగార్జున ప్రకటించారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. జైనబ్‌ తో మా అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తుందుకు చాలా సంతోషంగా ఉంది.

Also Read:  Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య

జైనబ్‌ చిత్రకారిణి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్‌, లండన్‌ లోనూ ప్రదర్శనలిచినట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్‌ లో పుట్టి ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. జైనబ్‌ తండ్రి జుల్ఫీ , నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. 

జైనబ్‌కు రెండేళ్ల క్రితం అఖిల్‌ తో పరిచయం ఏర్పడిందని..ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment