Aghori-Sri Varshini Issue: ఇవేం ట్విస్టులు రా సామీ.. అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు.. విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!

అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update

అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు సనాతన ధర్మం, మహిళ సమస్యలపై పోరాడుతానని చెప్పిన అఘోరీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీవర్షిణి ఫ్యామిలీ అఘోరీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవర్షిణి అన్న హర్ష అఘోరీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అఘోరీ తమ ఇంట్లో ఉన్నపుడు తనపై అసభ్యకరంగా ప్రవర్తించిందని తెలిపాడు. అంతేకాకుండా తనకు ముద్దులు పెడుతూ.. బుగ్గలు కొరికిందని అన్నాడు. 

15 రోజులు శ్రీవర్షిణి ఇంట్లో

ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతటికీ మూల కారణం విష్ణు అని తెలుస్తోంది. విష్ణు దాదాపు 13 ఏళ్లుగా శ్రీవర్షిణి ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన ఆఫీసు వద్ద అఘోరీ కారు రిపేర్ అవడంతో.. ఆమెను శ్రీవర్షిణీ ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం శ్రీవర్షిణీ ఫ్యామిలీకి అఘోరీని పరిచయం చేశాడు. అలా అఘోరీ దాదాపు 15 రోజులు శ్రీవర్షిణి ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

ఇప్పుడు అఘోరీతో శ్రీవర్షిణి వెళ్లిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై శ్రీవర్షిణీ అన్నగా చెప్పుకుంటున్న విష్ణు.. అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రీవర్షిణి పేరెంట్స్‌కు అఘోరీ డబ్బు ఆశచూపిందని అన్నాడు. ఖరీదైన వస్తువులు, మొబైల్‌ ఫోన్లు కొనిచ్చిందని తెలిపాడు.

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

అంతేకాకుండా శ్రీవర్షిణికి లక్ష రూపాయల కాలేజీ ఫీజు  చెల్లించిందంటూ అఘోరీపై ఆరోపణలు చేశాడు. అఘోరీ అకౌంట్‌లో రూ.10 లక్షలు నుంచి రూ.20 లక్షలు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని.. అన్ని అకౌంట్ ట్రాన్సక్షన్స్ తన వద్ద ఉన్నాయని అన్నాడు. 

Also Read :  రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి

రూ.1.50 ట్రాన్సక్షన్స్ చేసింది

తనకు రూ.1.50 ట్రాన్సక్షన్స్ చేసిందని తెలిపాడు. మంగళగిరిలోని BIGCలో రూ.1లక్ష విలువైన ఆరు ఫోన్లు అఘోరీ కొన్నాది అని సంచలన విషయాలు బయటపెట్టాడు. అలాగే తనకు ఉన్న రూ.45లక్షల విలువ గల ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చుకుంటానని ఆమెకు చెప్పినపుడు తానే రూ.50లక్షలు ఇస్తానని చెప్పిందని తెలిపాడు. అఘోరీ వద్ద ఉన్న డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయిందని సమాచారం. 

అయితే రూ.50లక్షలు ఇస్తానని అఘోరీ చెప్పి.. ఒక కండీషన్ పెట్టినట్లు తెలిసింది. ఆ డబ్బు తాను ఇస్తానని.. బదులుగా తనతో శ్రీవర్షిణీని పంపించమని అఘోరీ చెప్పడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే ఈ వ్యవహారం రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం పైనున్న వీడియో చూస్తే ఒళ్లు గగుళ్లు పొడిచే విషయాలు ఉన్నాయి.

(aghori news | aghori sri varshini | btech student sri varshini | lady aghori sri varshini relation | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment