Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు!

నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపింది. విడాకుల విషయంలో అక్టోబర్‌ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

New Update
Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు!

Chennai: నటుడు రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth), అల్లుడు ధనుష్ (Dhanush)లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపించింది. విడాకుల విషయంలో అక్టోబర్‌ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు 2ఏళ్ల క్రితం 2022 జనవరిలో ధనుష్‌-ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకేందుకు ఇటీవలే విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai family court)కు దరఖాస్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Prasanth Varma: ‘హనుమాన్’ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్స్.. క్యూ కడుతున్న మేకర్స్!

పరస్పర అంగీకారంతో విడాకులు..
ఇందులో భాగంగానే సెక్షన్‌ 13బీ కింద పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్టోబర్‌ 7న ధనుష్‌ – ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. ఇదిలావుంటే.. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా డమ డివోర్స్ ను ప్రకటించారు. 2004 నవంబర్‌ 18న వీరిద్దరూ వివాహం చేసుకోగా.. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

నిర్మాత దిల్ రాజు రేపు భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతుందని టాక్.

author-image
By Archana
New Update
dil Raju big announcement

dil Raju big announcement

Dil Raju:  సౌత్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా  'గేమ్ ఛేంజర్' దెబ్బేసిన.. ఆ తర్వాత విడుదలైన  'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమా గట్టెక్కించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  

దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్ 

ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. రేపు దిల్ రాజు ఓ భారీ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | dil-raju ameerkhan 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment