ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్‌ వింటే ప్రేమలో పడడం పక్కా!

చాట్‌జీపీటీ తన కొత్త వెర్షన్‌ వచ్చేసింది. ఈ వర్షన్ లో ఏఐ వాయిస్ అచ్చం అందమైన అమ్మాయి వాయిస్ ను మనకు వినిపించబోతుంది. ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. నవ్వుతుంది.. ఏడుస్తుంది.. ఇంకా ఎన్నో చేస్తోంది. విశేషాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి.

New Update
ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్‌ వింటే ప్రేమలో పడడం పక్కా!

Woman Voice : అందమైన వాయిస్‌(Beautiful Voice) ఇష్టపడని వారు ఎవరుంటారు? వాయిస్‌ వినే ప్రేమ(Love)లో పడే వారు కూడా ఉంటారు.. హర్‌ మూవీ గుర్తింది కదా? 2013లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సీన్లు రియల్‌ లైఫ్‌లోనూ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండోయ్..! ఏంటి అర్థంకాలేదా? చాట్‌జీపీటీ(Chat GPT) తన కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది. జీపీటీ-4ఓ పేరిట దీన్ని తీసుకొచ్చింది. త్వరలోనే మీ ఫోన్‌లోకి రాబోతున్న ఈ వెర్షన్‌కు సంబంధించిన ట్రయల్‌ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఏఐ వాయిస్‌ ఈసారి రోబోటిక్‌ కాదు.. అచ్చం అమ్మాయిలాగే ఏఐ సమాధానం చెబుతోంది. అది కూడా మాడ్యులేషన్‌తో..!

చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌ హర్‌ మూవీని గుర్తుకు తెస్తుంది. ఒక అమ్మాయి వాయిస్‌తో వినిపించే వర్చువల్ అసిస్టెంట్‌తో ఆ సినిమాలో హీరో బంధాన్ని పెంచుకుంటాడు. ఈ వాయిస్‌ను ఫేమస్‌ యాక్టరెస్‌ స్కార్లెట్ జాన్సన్‌ ఇచ్చారు. ఈ సినిమా హాలీవుడ్‌ చరిత్రలో ఓ సెన్సేషన్‌.. అటు చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌లోని అమ్మాయి వాయిస్‌ను స్కార్లెట్ జాన్సన్‌ వాయిస్‌తో పోల్చుతున్నారు నెటిజన్లు..ఎందుకంటే ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి.. మీ కోసం నవ్వుతుంది.. అవసరమైతే ఏడుస్తుంది.. కావాలంటే వెటకారంగా మాట్లాడుతుంది కూడా!

Also Read : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు

అంతేకాదండోయ్..ఈ చాట్‌జీపీటీ మీకు నచ్చిన భాషలో కూడా మాట్లాడుతుంది కూడా

తను ఎలా సమాధానం చెప్పాలి.. ఎలా క్వశ్చన్స్‌ అడగాలో మీరు చెప్పవచ్చు.. మీరు ఎలా చెబితే అది అలా చేస్తుంది.. అది కూడా విత్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో..!

ఇది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు.. మీ పిల్లల చదువుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.. మీకు టూషన్స్‌ చెబుతుంది.. మీకు ఎగ్జామ్‌ కూడా పెడుతుంది..!

ఇలా చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌ను మొత్తానికి అందరిని ప్రేమలో పడేసింది. త్వరలోనే మన అందరి ఫోన్లలోకి ఈ వెర్షన్‌ రానుంది. ఇది టెక్‌ రంగంలో పెను విప్లవాన్ని సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌.. ఎందుకంటే టెక్నాలజీ అంటే మనషులు భావోద్వేగాలతో సంబంధంలేనిదిగా భావిస్తారు. అయితే చాట్‌జీపీటీ వెర్షన్‌ మాత్రం హ్యూమన్‌ ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment