KL Rahul : 'నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..' కేఎల్‌రాహుల్‌ ఎమోషనల్‌!

సెంచూరియన్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ ఎమోషనల్ అయ్యాడు. గతంలో తనపై జరిగిన సోషల్‌మీడియా ట్రోల్స్‌ను తలుచుకోని బాధపడ్డాడు. 100 పరుగులు చేసినప్పుడు, ప్రజలు 'వావ్' అంటారని.. ఫెయిలైనప్పుడు దుర్భాషలాడారని కామెంట్ చేశాడు.

New Update
KL Rahul : 'నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..' కేఎల్‌రాహుల్‌ ఎమోషనల్‌!

South Africa : లైఫ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నీ వేళల మనకు నచ్చినట్టే అన్నీ జరగవు. జీవితంలో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు సహజం. కిందపడినప్పుడు పైకి లేపేవారు ఉన్నట్టే అంతకంటే ఎక్కువగా గెలీ చేసేవారుంటారు. అవన్ని భరించి ముందుకుసాగితేనే జీవితం.. మన పనితోనే విమర్శకుల మూతి మూయించడమే విజయం. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) విక్టరీల బాటలో ఉన్నాడు. బ్యాటింగ్‌, కీపింగ్‌లలో రాణిస్తున్నాడు. ఐపీఎల్‌(IPL)లో గాయం తర్వాత తిరిగి వన్డే ప్రపంచకప్‌(World Cup 2023) లో రీఎంట్రీ ఇచ్చిన రాహుల్‌ మెగా టోర్నిలో సత్తా చాటినట్టే దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపైనే తాను ఎంత విలువైన ప్లేయర్‌నో తన ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులకు కూడా చూపిస్తున్నాడు. టీమిండియా బ్యాటర్లంతా విఫలమైన చోట సెంచరీతో కదం తొక్కిన రాహుల్‌ మ్యాచ్‌ తన ఇన్నింగ్స్‌ తర్వాత ఎమోషనల్‌ అయ్యాడు.

చాలా బాధపడ్డా:
సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ 245లో రాహుల్ ఒక్కడే 101 రన్స్ చేశాడు. అది కూడా 73 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత రాహుల్‌ విలువేంటో అందరికి అర్థమైంది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అతను గతంలో తనపై జరిగిన ట్రోల్స్‌కు ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

'ఇది సహజంగానే చాలా కష్టం. మీరు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు, క్రికెటర్లుగా, వ్యక్తిగా, వ్యక్తిగతంగా ప్రతిరోజూ, ప్రతి క్షణం సవాలు ఎదుర్కొంటారు. సోషల్ మీడియా ఒత్తిడి ఉంటుంది. మీరు 100 పరుగులు చేసినప్పుడు, ప్రజలు 'వావ్' అంటారు. , వావ్'.కానీ 3-4 నెలల క్రితం, వారు నన్ను దుర్భాషలాడారు. ఇది ఆటలో భాగం ' అని సెంచూరియన్‌లో రెండో రోజు ఆట తర్వాత రాహుల్ కామెంట్స్ చేశాడు.

'ఇది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, ఇది నన్ను ప్రభావితం చేయదని నేను చెప్పను, కానీ, మీరు సోషల్ మీడియాలోని నెగిటివిటీకి దూరంగా ఉంటే మీ మైండ్‌సెట్, మీ గేమ్ మెరుగ్గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చాడు.

సెంచూరియన్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఓవర్సీస్ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు.2021లో ఇదే సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టాడు.

Also Read: ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్‌ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment