Andhra Pradesh: ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌ రోడ్‌ కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కూడా నితిన్‌ గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లండించారు.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

Andhrapradesh: విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌ రోడ్‌ కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కూడా నితిన్‌ గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లండించారు. ఎన్టీఆర్‌హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫైఓవర్‌ కు అనుమతి లభించినట్లు తెలిపారు. వీటన్నింటిపై తగి ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లండించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పీఎం మోడీ తో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్ర సహకారం అంశం పై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్‌ అంశాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

పీఎం మోడీ, పీయూష్ గోయల్‌, నితన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ ఛౌహన్‌, హోం మినిష్టర్‌ అమిత్‌ షా వంటి వారిని చంద్రబాబు నాయుడు కలిశారు.

Also read: అయ్యా నాభూమి నాకు ఇప్పించండి.. ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం

Advertisment
Advertisment
తాజా కథనాలు