canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని...భారత్ కు ఎప్పుడు చెప్తారో.

మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.

New Update
ట్రూడో నువ్ మారవా? భారత్ పై మళ్లీ అవే నిందలు..!!

కెనడాను వరుసపెట్టి వివాదాలు చుట్టుముడుతున్నాయి. భారత్ విషయంలో పట్టుమీదున్న ఆ దేశం ఉక్రెయిన్ విషయంలో మాత్రం దిగొచ్చింది. ఇందులో నాజీ అంశం కెనడాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రపంచ దేశాల నుంచి విపరీతంగా విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. దాంతో పాటూ కెనడా స్పీకర్ రాజీనామాకు కూడా దారి తీసింది. అందుకే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని ఆ దేశం భావించింది. అందులో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రుడో బహిరంగా ఉక్రెయిన్ దేశానికి క్షమాపణలు చెప్పారు. దీని కోసం దౌత్య మార్గాల్లో చర్చలు కూడా జరిపారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రీసెంట్ గా కెనడాలో పర్యటించారు. సెప్టెంబర్ 22న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కెనడా పార్లమెంట్‌లో ప్రసంగించారు.ఆయన ప్రసంగం తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాపై పోరాడిన 98 ఏళ్ల యారోస్లావ్ హుంకాకి గౌరవవందనం చేశారు.కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్పీకర్ సహా ఎంపీలందరూ హుంకా గౌరవార్థం లేచి నిల్చున్నారు.హుంకా యుద్ధవీరుడని స్పీకర్ ఆంథోని రోటా ప్రశంసించారు. ఆయన ఉక్రెయిన్ మొదటి డివిజన్‌కి చెందిన వారని చెప్పారు. దీనికి అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రుడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత హుంకా గురించి అసలు నిజం తెలిసింది. ఆయన హిట్లర్ సైన్యంలో పనిచేశారని, నాజీల తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని తెలిసింది. ఈ సంఘటన ట్రుడో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.

కెనడా ప్రధాని ఉక్రెయిన్ కు క్షమాపణలు చెబుతూ ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించేందుకు రష్యా మా తప్పిదాన్ని రాజకీయం చేస్తోంది. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. హుంకాను గౌరవించినందుకు స్పీకర్ రోటా  ఇంతకుముందే క్షమాపణలు చెప్పారు. యుక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం తర్వాత, గ్యాలరీలో ఒక వ్యక్తిని చూశాను. ఆయనను గౌరవించాను. ఆ తర్వాత ఆయన గురించి మరింత సమాచారం తెలిసింది. నా నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు. కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను చేసిన పనికి నాదే బాధ్యత అని రోటా తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది అంతా బాగానే ఉంది కానీ భారత్ తో వివాదాన్ని మాత్రం కంటిన్యూ చేస్తోంది కెనడా ప్రభుత్వం. ఈ విషయంలో రోజురోజుకూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment